పుట్టపర్తిలో సాయి ప్రశాంత్ ట్రస్టు ఆక్రమణ | Sakshi
Sakshi News home page

పుట్టపర్తిలో సాయి ప్రశాంత్ ట్రస్టు ఆక్రమణ

Published Fri, Mar 6 2015 10:15 AM

puttaparthi sai land accupied by a tdp person

పుట్టపర్తిలో ఓ అక్రమం వెలుగు చూసింది. ఆస్ట్రేలియాకు చెందిన దాయాస్టార్ అనే వ్యక్తి పుట్టపర్తిలో స్థాపించిన సాయి ప్రశాంత్ ట్రస్టును శ్రీనివాస్ అనే వ్యక్తి ఆక్రమించాడు. అతడికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత గంగన్న నిలిచాడు. మద్దతుగా నిలవడమే కాకుండా ఫోర్జరీ డాక్యుమెంట్లతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాడు.

 

దీంతో తమకు న్యాయం చేయాలంటూ దాయాస్టార్ పీఎంవోతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ పోలీసులు స్పందించకుండా టీడీపీ నేతలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే బుక్కపట్నం పోలీసులు మాత్రం శ్రీనివాస్పై చీటింగ్ కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement