సాక్షి, రాజమండ్రి : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి చాటి చెప్పాలనే లక్ష్యం తోనే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సమై క్య శంఖారావం విజయవంతానికి రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన వారు మంగళవారం దానవాయిపేటలోని పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ ఈ సభ పూర్తిగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో సమైక్యతకు కట్టుబడిన పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, దానికోసం చిత్తశుద్ధితో కృషిచేస్తున్న నేత జగన్ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
అందుకే రాష్ట్రం నలుమూలల నుంచి సమైక్యవాదులు భారీగా రానున్నారని చెప్పా రు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 20 వేలకు పైగా ప్రజలు ఈ సభకు హాజరుకానున్నారని తెలిపారు. అంతే కాకుం డా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన సెటిలర్లు కూడా వేలాదిగా సభకు తరలి వచ్చేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢ సంకల్పానికి ప్రతి రూపంగా సమైక్య శంఖారావం సభ నిలుస్తుందన్నారు. ఢి ల్లీ పెద్దలకు బుద్ధి చెప్పేలా ఈ సభను విజయవంతం చేయాలని సమైక్యవాదులకు ఆదిరెడ్డి పిలుపునిచ్చారు. ‘రాష్ట్రం విడిపోతేసీమాంధ్రకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది.
ఆదాయ వనరులు మృగ్యం అవుతాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ఎడారి అవుతుందనే వాస్తవాన్ని ఈ సభ ద్వారా జగన్ ప్రజల్లో చైతన్యం తెస్తారు’ అని ఆదిరెడ్డి అన్నారు. రాజమండ్రి సిటీ కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్కుమార్ మాట్లాడుతూ రాజమండ్రి నుంచి వేలాదిగా సమైక్య వాదులు హైదరాబాద్ తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ నాయకుడు బొడ్డు వెంకట రమణచౌదరి, ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, నియోజకవర్గ సమైక్యాంధ్ర ఉద్యమ పర్యవేక్షకులు ఆర్వీవీఎస్ సత్యనారాయణ చౌదరి, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు మార్గాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష ఢిల్లీని తాకాలనే సమైక్య శంఖారావం
Published Wed, Oct 23 2013 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement