ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాం.. | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాం..

Published Tue, Mar 20 2018 7:03 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు:చాలీచాలని జీతాలతో ఆరులక్షల మంది నర్సింగ్‌ ఉద్యోగులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాయకులు వైఎస్‌ జగన్‌ ఎదుట తమ కష్టాలను విన్నవించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కాకుమాను శివారుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ను అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్, సెక్రటరీ మాధవి తదితరులు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్‌ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ, జీతాల విషయంలో మోసానికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే పని ఒక్కటే అయినా వివిధ రకాల పేర్లుతో వ్యత్యాసం చూపిస్తోందని వాపోయారు. నర్సింగ్‌ వ్యవస్థను బతికించాలని వేడుకున్నారు.

Advertisement
Advertisement