బైక్‌, లారీ ఢీ : ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌, లారీ ఢీ : ఒకరి మృతి

Published Fri, Apr 10 2015 4:09 PM

one died in road accident

కారంచేడు : గుంటూరు జిల్లాలో వేగంగా వెళ్తున్న బైక్‌ను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని  వెదుల్లపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన రాజు(25), అదే గ్రామానికి చెందిన డేవిడ్‌లు కలిసి ప్రకాశం జిల్లా కు చెందిన గేరా గాంధీ(30) అనే వ్యక్తితో బైక్‌పై బాపట్ల నుంచి పర్చూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారంచేడు సమీపంలో వీరి వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాంధీ పరిస్థితి విషమంగా ఉండగా, డేవిడ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108లో చీరాల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement