పాస్టర్ పై నిర్భయ కేసు నమోదు | Sakshi
Sakshi News home page

పాస్టర్ పై నిర్భయ కేసు నమోదు

Published Sun, Jul 5 2015 7:59 PM

Nirbhaya case filed against a church paster

చిత్తూరు: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ చర్చి పాస్టర్ను స్థానిక వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో షర్మన్ ఎయిడెడ్ బాలికల పాఠశాల హెచ్‌ఎం తిరుఅరుల్‌ప్పావై భర్త శామ్యూల్ ప్రఫుల్లా ఈ దురాగతానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసే అవకాశం ఉంది.

నిందితుడు శామ్యూల్ నగరంలోని ఓ చర్చిలో పాస్టర్‌గా కొనసాగుతున్నారు. బాధిత బాలికను శనివారం రాత్రి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ను కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశించారు. ఆదివారం పాఠశాలను సందర్శించిన డీఈవో పలువురు విద్యార్థుల్ని విచారించారు. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు డీఈవో తెలిపారు.

Advertisement
Advertisement