కారు, లారీ ఢీ: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ: ముగ్గురు మృతి

Published Sun, Oct 19 2014 9:21 AM

Lorry, car accident in kurnool district

కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ టోల్గేట్ వద్ద కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లావాసులని పోలీసులు తెలిపారు. మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు చెప్పారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement