కేసీఆర్ సర్కార్పై గంటా ఫైర్ | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సర్కార్పై గంటా ఫైర్

Published Sat, Jan 31 2015 9:12 AM

కేసీఆర్ సర్కార్పై గంటా ఫైర్ - Sakshi

తిరుమల: తెలంగాణ సర్కార్పై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం తిరుమలలో నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. పొరుగు రాష్ట్రమైన ఏపీతో టీ సర్కార్ కయ్యానికి కాలు దువ్వుతుందని విమర్శించారు. ఆచరణ సాథ్యం కానీ  హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని గంటా ఈ సందర్బంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఫాస్ట్ పథకంపై టీ సర్కార్ వెనక్కి తగ్గడం అభినందనీయమని గంటా అన్నారు. ఏపీ ఉన్నతి విద్యామండలి చెందిన ఖాతలను ఫ్రీజ్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకు ముందు తిరుమలలో వీఐపీ ప్రారంభ సమయంలో గంటా శ్రీనివాసరావు శ్రీవారిని దర్శించుకున్నారు.
 

Advertisement
Advertisement