అనంతపురం క్రైం: జిల్లాలో గ్యాంగ్స్టర్ల సంస్కృతి పెరుగుతోంది. కొంతమంది యువకుల ముఠాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. అనంతపురం నగరంలో ఇటువంటి సాంప్రదాయం పెరుగుతోంది. తాజా ఈనెల 28 రాత్రి జరిగిన హత్యను ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలోనూ అంబేద్కర్నగర్లో సిద్దు ఇదే తరహాలో హత్యకు గురయ్యాడు. అంతకు ముందు రామనగర్లో రెండు గ్రూపులు పరస్పరం దాడులకు దిగాయి. ఇప్పటికీ ఆ గ్రూపుల మధ్య ఘర్షణ నివురుగప్పిన నిప్పులా ఉన్నట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. భూ వివాదాలు, బెట్టిం గులు వంటి కార్యకలాపాల్లో భాగస్వామ్యులు అవుతున్నారు.ఈ క్రమంలోనే దాడులు జరుగుతున్నాయి. వీరి నడుమ సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు.
రాత్రి సమయంలో సమావేశాలు:
ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివే విద్యార్థులు రాత్రి సమయంలో అనేక కూడళ్లు, టీ కేఫ్ల వద్ద గ్రూపులుగా ఏర్పడి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి 12 గంటలైనా ఇళ్లకు వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లో చర్చలు జరుపుతున్నారు. వీరిని దారిలో పెట్టాలనుకునే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది.
మారణాయుధాల కోసం అన్వేషణ:
తమ ప్రత్యర్థులను మట్టు బెట్టేందుకు మరణాయుధాల కోసం గోవా, చె న్నై, తదితర ప్రాంతాల్లో మరణాయుధాలు కొనుగోలు చేస్తున్నారు. అదే వేటకొడవళ్లు, పదునైన కత్తులు, హైదరాబాద్లో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సంఘటనే కాకుండా మరికొన్ని సంఘటనలకు విద్యార్థులు నాంది పలికే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే సమకూర్చు కున్నట్లు సమాచారం.
చోద్యం చూస్తున్న పోలీసులు:
రాత్రి సమయంలో విద్యార్థులపై నిఘా వేయాల్సిన పోలీసు మిన్నకుండిపోతున్నారు. కొంతమంది స్థానికులు విద్యార్థులు గుంపులు, వారి చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు విద్యార్థులను అదుపుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విద్యార్థి దశలో ముఠా కక్షలు
Published Wed, Jul 1 2015 10:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement