- గుప్తనిధుల తవ్వకాల కోసం యువకుడి బలి
- నిశ్శంకుదుర్గంలో దుర్ఘటన
- మిత్రులే కడతేర్చిన వైనం
- గుండెలు బాదుకున్న యువకుడి తల్లి
కార్వేటినగరం: గుప్తనిధుల తవ్వకాల కోసం ఓ యువకుడిని మిత్రులే హతమార్చిన సంఘటన కార్వేటినగరం మండల పరిధిలోని నిశ్శంకుదుర్గంలో చోటుచేసుకుంది. దాదాపు పన్నెండు రోజుల కిందట అదృశ్యమైన అతడు శనివారం శవమై ప్రత్యక్షమయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతడిని తీసుకెళ్లిన మిత్రులను పోలీసులు పట్టుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది.
పోలీసుల కథనం మేరకు... పుత్తూరు పరిధిలోని గేటు పుత్తూరుకు చెందిన చిత్ర, గణేష్ దంపతుల కుమారుడు ఉదయబాబు అలియాస్ ఉదయ్కుమార్ (22) ఈ నెల 12న ఇంట్లో నిద్రిస్తుండగా స్నేహితులు రమేష్, చిరంజీవి వెళ్లి ఉదయ్కుమార్ను తీసుకెళ్లారు. వారితో పాటు షాజహాన్ మరో ఇద్దరు కలిసి రెండు ద్విచక్ర వాహనాల్లో కార్వేటినగరంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఉన్న నిశ్శంకుదుర్గం ప్రాంతానికి వెళ్లారు. అందరూ కలిసి మద్యం సేవించారు. గుప్త నిధులు తవ్వకాల కోసం కోటకు వెళ్లారు. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు ముందుగా బలిదానం చేయాలని భావించారు. మద్యం మత్తులో ఉన్న ఉదయ్కుమార్ గొంతుకోసి కొండపై నుంచి కిందకు తోసేశారు. ఉదయ్కుమార్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు.
ఎన్నిచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దాంతో అతడిని తీసుకెళ్లిన యువకులపై అనుమానం వచ్చింది. పుత్తూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రమేష్, చిరంజీవి, షాజహాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. శనివారం ఉదయం నిశ్శంకు దుర్గంలోని అటవీ ప్రాంతంలో కార్వేటినగరం ఎస్ఐ రాజశేఖర్ తదితర పోలీసులు వెళ్లి అతడి అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన ఉదయ్కుమార్ సెల్ఫోన్, ఇతర వస్తువులను గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పుత్తూరు డీఎస్పీ నాగభూషణరావు, కార్వేటినగరం సీఐ వెంకేటేశ్వరులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడని గంపెడు ఆశతో ఉన్న తమకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి వెళ్లాడని ఉదయ్కుమార్ తల్లి రోదిస్తోంది.
మిత్రులే హతమార్చారు
Published Sun, Apr 26 2015 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement