సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించలేని పక్షంలో రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన విధించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు అంశంపై ఇష్టం వచ్చినట్లు సిఫారసులు చేసిన మంత్రుల బృందం సభ్యులు సోనియాకు బంట్రోతులు మాదిరిగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘సోనియాకు రాజ్యాంగం తెలియదు, ఆమె దాన్ని చదవలేదు..’ అని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ అధ్యక్షురాలు ఏం చెబితే జీవోఎం సభ్యులు అది చేశారని విమర్శించారు.
హైదరాబాద్కు ధీటుగా అద్భుత రాజధానిని అడవిలో నిర్మిస్తామని ప్రతిపాదన చేశారని, అక్కడ ఒక పశువుల ఆసుపత్రిని నిర్మించి జంతువులకు చికిత్స చేస్తే బాగుండేదన్నారు. యూపీఏ ప్రభుత్వంపై ప్రతిఒక్క ఎంపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఇంటికి పంపించాలన్నారు. అప్పుడే దేశాన్ని రక్షించిన వారవుతారన్నారు. రాష్ర్ట ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఎలాగూ మూడు నెలల్లో ఇంటికి పోతుందంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల్లో 28 సీట్లలో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్కు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ఒకవేళ అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలకు చంద్రబాబును సమాధానాలు కోరేది.
1. సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన మరుసటి రోజు.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్లు అవ సరమవుతాయని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేసిన మీరే ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడటమేంటి?
2. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగిలిన పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మీరు మద్దతిచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా?
3. లోక్సభలో మీ పార్టీ ఎంపీలు ఆరుగురు ఉండగా, వారిలో సీమాంధ్రకు చెందిన నలుగురు ఎంపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయడంలోని ఆంతర్యమేమిటి?
రాష్ట్రపతి పాలన పెట్టండి
Published Tue, Dec 10 2013 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement