వైఎస్‌ జగన్‌కు బ్రాహ్మణ దంపతుల ఆశీర్వాదం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు బ్రాహ్మణ దంపతుల ఆశీర్వాదం

Published Tue, Nov 28 2017 12:23 PM

Brahmin Couple Blesses YS Jagan in PrajaSankalpaYatra - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో జరుగుతున్న అరాచపాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని మంగళవారం పుట్టపాశం గ్రామంలో బ్రహ్మణ రమేష్‌, పద్మ దంపతులు ఆశీర్వదించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భిక్ష వల్లే అనంతపురం డెయిరీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు.

డెయిరీలో తాను పదవీ విరమణ వరకూ ఉద్యోగం చేయగలిగానంటే అది వైఎస్‌ చలవే అని రమేష్‌ తెలిపారు. ఉద్యోగం ఉండటం వల్లే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, పెళ్లిళ్లు చేయగలిగామని చెప్పారు. 2004లో వైఎస్‌ కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినట్లైతే వారి బతుకులు రోడ్డున పడేవని అన్నారు.

Advertisement
Advertisement