హైకోర్టులో భారతి సిమెంట్స్ పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: కడప జిల్లా, కమలాపురం మండలం, పందిళ్లపల్లి, తురకపల్లి, టి.సిదిపిరాళ్ల, యర్రంగుంట్ల మండలం, టి.సుంకేసుల, తిప్పలూరు గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో తమకు కండిషనల్ మైనింగ్ లీజు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఉద్దేశపూర్వక తాత్సారం చేస్తోందంటూ భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. వీలైనంత త్వరగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన రెండు వ్యాజ్యాల్లో భారతి సిమెంట్స్ కోరింది.
ఈ వ్యాజ్యాలను శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కారణాలతోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని వివరించారు. ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీ కావడంతో ప్రభుత్వం దురుద్దేశాలతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే తమకు కండిషనల్ మైనింగ్ లీజు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, దసరా సెలవుల నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను వెకేషన్ కోర్టు ముందుంచుతామని తెలిపింది. ఈ నెల 6న ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టాలని కోరుతామని పేర్కొంది. ఈ విచారణ నాటికి ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విషయంలో స్పష్టతతో ఉండాలని, వివరాలను ఆ ధర్మాసనం ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదికి ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఉద్దేశపూర్వకంగానే ప్రజాభిప్రాయ సేకరణ జాప్యం
Published Sat, Oct 1 2016 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement