- పలు రైళ్లకు అదనపు బోగీలు
దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జరుగనున్న గోదావరి పుష్కరాలకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే 58 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే పలు రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రత్యేక రైళ్ల కోసం ఆదివారం (జూన్ 28) ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం ప్రారంభం కానున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు కాకినాడ-హైదరాబాద్-కాకినాడ (07701/07702) మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడుపుతారు. జూలై 12, 16, 20, 24 తేదీలలో రాత్రి 11 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 13, 17, 21, 25 తేదీలలో సాయంత్రం 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కు కాకినాడ చేరుకుంటాయి. ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా నడుస్తాయి.
కాకినాడ-హైదరాబాద్-కాకినాడ (07703/07704) మధ్య మరో 8 ప్రత్యేక రైళ్లు జూలై 14, 18, 22, 26 తేదీలలో సాయంత్రం 7.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30కు హైదరాబాద్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 15, 19, 23, 27 తేదీలలో సాయంత్రం 3.45కు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45కు కాకినాడ చేరుకుంటాయి. ఈ రైళ్లు సైతం విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
హైదరాబాద్-విశాఖ-హైదరాబాద్ (07706/07705) మధ్య 8 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. జూలై 12, 16, 20, 24 తేదీలలో రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.15కు విశాఖ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 13, 17, 21, 25 తేదీలలో సాయంత్రం 4.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు హైదరాబాద్ చేరుకుంటాయి. విజయవాడ, కాజీపేట్ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి.
హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్డు-హైదరాబాద్ (07708/07707) మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 14, 18, 22, 26 తేదీలలో సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15కు శ్రీకాకుళం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో జూలై 15, 19, 23, 27 తేదీలలో మధ్యాహ్నం 1.15 కు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు హైదరాబాద్ చేరుకుంటాయి.
తిరుపతి-పార్వతీపురం-ధర్మవరం (07709/07710) మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూలై 13, 17, 21, 25 తేదీలలో రాత్రి 11 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు పార్వతీపురం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం-ధర్మవరం (07710) జూలై 14, 18, 22, 26 తేదీలలో సాయంత్రం 6.45 కు పార్వతీపురం నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.25 కు ధర్మవరం చేరుకుంటాయి.
విజయవాడ-విశాఖపట్టణం (07714) మధ్య 8 ప్రత్యేక రైళ్లు జూలై 16, 17, 18, 19, 23, 24, 25, 26 తేదీలలో రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటాయి.
అనకాపల్లి-మచిలీపట్నం (07713) మధ్య జూలై 19, 26 తేదీలలో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి.
అదనపు బోగీలు....
సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, కాకినాడ-బెంగళూర్ శేషాద్రి ఎక్స్ప్రెస్,తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్, తిరుపతి-బిలాస్పూర్, కాచిగూడ-చెన్నై, కాకినాడ-చెన్నై, తదితర రైళ్లలో ఏసీ టూటైర్, ఏసీ త్రీటైర్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేస్తారు.
గోదావరి పుష్కరాలకు 58 ప్రత్యేక రైళ్లు
Published Sat, Jun 27 2015 11:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement