సాక్షి ప్రతినిధి, ఏలూరు/పోలవరం రూరల్/ఏలూరు మెట్రో/అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. త్వరలో జరగబోయే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందన్నారు.
సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఆయన ఎగువ కాఫర్ డ్యాం పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ లభించిందని చెప్పారు. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాజెక్టు సందర్శనకు వస్తారని చెప్పారు. గోదావరితో పాటు పెన్నా, కృష్ణా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేసి ఐదు దశల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల తొమ్మిది జిల్లాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.
మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత మీదే!
అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో సోమవారం జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధికార మిత్రల గురించి మాట్లాడుతూ.. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమిస్తున్నామని చెప్పారు. వీరు ఆ 35 కుటుంబాల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాల్వ ప్రాజెక్టును మార్చి, ఏప్రిల్లోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టి మన సంస్కృతిని చాటిచెబుతామన్నారు. ఆధునిక వ్యవసాయ విధానాలు అమలు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పశ్చిమగోదావరిని ఆదర్శ జిల్లాగా ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలకూ సిమెంట్ రోడ్లు వేసేందుకు రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
పోలవరానికి అడ్డంకులు తొలిగాయి: సీఎం
Published Tue, Jan 9 2018 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement