-
రేణుకా యల్లమ్మ దేవి ఆలయ హుండీ లెక్కింపు
కోలారు: నగరంలోని పీసీ కాలనీలో వెలసిన రేణుకా యల్లమ్మ దేవి ఆలయంలో ఇటీవల పూల కరగ ఉత్సవం సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ సేవా సమితి అధ్యక్షుడు కె గణేష్ నేతృత్వంలో సోమవారం ఆలయంలో లెక్కించారు. హుండీలో సుమారు రూ.54,220 నగదు సంగ్రహమైంది. కాగా ఈ హుండీ లెక్కింపు ప్రక్రియలో జిల్లా కాంగ్రెస్ కమిటీ షెడ్యూల్డ్ కులాల విభాగం అధ్యక్షుడు కె జయదేవ్, ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్, కోశాధికారి కేఎస్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు క్రికెట్ బుకీలపై కేసులు హుబ్లీ: రెండు ప్రత్యేక కేసుల్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురిపై అశోక్ నగర్, కేశ్వాపుర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇక్కడి గోపనకొప్ప బస్టాండ్ వద్ద బహిరంగ స్థలంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వెంకటేష్ కబాడేపై కేశ్వాపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక్కడి నృపతుంగ గుట్ట వద్ద క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నగరానికి చెందిన సునీల్ నాకోడ్, ప్రమోద్ దాఖలే అనే ఇద్దరు నిందితులపై అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ల దొంగ అరెస్ట్ హుబ్లీ: రైలు ప్రయాణికుల మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి రూ.47,500 విలువ చేసే వివిధ మొబైళ్లను జప్తు చేశారు. ధార్వాడ తాలూకా అమ్మినబావి గ్రామ సుఖదేవ్ అలియాస్ అప్పు కట్టెమని నిందితుడు. ఇక్కడి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అతడిని పోలీసులు పట్టుకొని విచారించగా మొబైల్ దొంగగా తేలింది. ఆ మేరకు హుబ్లీ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వీనులవిందుగా గాన కచేరి
ప్రశాంతి నిలయం: సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సంగీత కచేరి నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాళవికా సుందర్ బృందం చక్కటి గాత్రంతో భక్తులను మైమరిపించారు. సుమారు గంట పాటు సంగీత కచేరి సాగింది. కళాకారులను ట్రస్టీ ఆర్జె.రత్నాకర్ రాజు ఘనంగా సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని సమాధి రోడ్డులో గల సత్యసాయి తల్లిదండ్రుల సమాధుల వద్ద వేడుకలను నిర్వహించారు. సత్యసాయి తల్లిదండ్రులు పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ సమాధులను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఈశ్వరమ్మను, సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాల్ని ఆలపించారు. -
పంట నష్టపరిహారం కోసం ధర్నా
కోలారు: ముంగారు వడగండ్ల వానలకు జిల్లాలో పలుచోట్ల పంటనష్టం జరిగి రైతులు నష్టపోయిన వాణిజ్య పంటలకు ప్రతి ఎకరాకు రూ.2 లక్షల పరిహారం అందించాలని రైతు సంఘం పదాధికారులు సోమవారం ముళబాగిలు తాలూకా వడ్డహళ్లి ఏపీఎంసీ ప్రాంగణం వద్ద జిల్లా ఇంచార్జి మంత్రి భైరతి సురేష్ ఫోటోతో ధర్నా చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ జిల్లా రైతులు అతివృష్టి, అనావృష్టి ఇలా ఏదో విధంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ముంగారు వడగండ్ల వానలతో బొప్పాయి రైతులు, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వాణిజ్య పంటలను నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు తలా రూ.2 లక్షల పరిహారం, కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోయి నష్టపోయిన కోళ్ల ఫారం రైతులకు తలా రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, తాలూకా అధ్యక్షుడు యలువళ్లి ప్రభాకర్, బంగారి మంజు, సునీల్కుమార్, నాగేష్, భాస్కర్, విజయపాల్ తదితరులు ఉన్నారు. -
ఓటుకు రూ.100–200ల పంపిణీ
● అసెంబ్లీ ఎన్నికల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు? సాక్షి,బళ్లారి: ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు ఓటరు జాబితాలో పేరు ఉన్న వారికి దాదాపుగా డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తీవ్ర కసరత్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బళ్లారి ఓటర్లకు ఒక జాతీయ ప్రధాన పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థి మద్దతుదారులు, కార్యకర్తలు రూ.100లు చొప్పున పంపిణీ చేయగా, మరో జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి తరపున నేతలు, కార్యకర్తలు ఓటుకు రూ.200 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. 2008 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి జిల్లాలో ఎన్నికలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు ఉండటంతో గత 20 ఏళ్లుగా జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేశారనే చర్చ సాగుతోంది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటరుకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.వెయ్యి పైనే, కొన్ని చోట్ల రూ.3 వేలు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటుకు ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు రూ.500ల వరకు పంపిణీ చేశారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటు కేవలం రూ.100లు ఒకపార్టీ, రూ.200లు మరోపార్టీ డబ్బులు పంపిణీ చేయడంతో ఓటర్లు ముక్కున వేలేసుకుని గమనిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కాని ఓటుకు రూ.100 ఇవ్వడమేంటని ఓటర్లు పరస్పరం చర్చించుకుంటున్నారు. మోదీ గ్యారెంటీతో గెలుస్తామని బీజేపీ, ఐదు గ్యారెంటీలతో గెలుస్తామని కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నా ఇక ఓటర్లకు డబ్బులు ఎందుకు పంచుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఓటుకు రూ.100–200ల పంపిణీ
● అసెంబ్లీ ఎన్నికల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు? సాక్షి,బళ్లారి: ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియ పూర్తి చేశారు. ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు ఓటరు జాబితాలో పేరు ఉన్న వారికి దాదాపుగా డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తీవ్ర కసరత్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బళ్లారి ఓటర్లకు ఒక జాతీయ ప్రధాన పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థి మద్దతుదారులు, కార్యకర్తలు రూ.100లు చొప్పున పంపిణీ చేయగా, మరో జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి తరపున నేతలు, కార్యకర్తలు ఓటుకు రూ.200 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. 2008 అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి జిల్లాలో ఎన్నికలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు ఉండటంతో గత 20 ఏళ్లుగా జిల్లాలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేశారనే చర్చ సాగుతోంది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటరుకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.వెయ్యి పైనే, కొన్ని చోట్ల రూ.3 వేలు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటుకు ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు రూ.500ల వరకు పంపిణీ చేశారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటు కేవలం రూ.100లు ఒకపార్టీ, రూ.200లు మరోపార్టీ డబ్బులు పంపిణీ చేయడంతో ఓటర్లు ముక్కున వేలేసుకుని గమనిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కాని ఓటుకు రూ.100 ఇవ్వడమేంటని ఓటర్లు పరస్పరం చర్చించుకుంటున్నారు. మోదీ గ్యారెంటీతో గెలుస్తామని బీజేపీ, ఐదు గ్యారెంటీలతో గెలుస్తామని కాంగ్రెస్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నా ఇక ఓటర్లకు డబ్బులు ఎందుకు పంచుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement