-
ఎల్జీ బాధితులకు అండగా..
2020, మే 7వ తేదీన జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు. అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆ పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాలను తరలించింది. వారందరికీ వారం రోజుల పాటు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించింది. అలాగే మృతుల కుటుంబాలకు రూ.కోటి, ఆస్పత్రిలో చికిత్ప పొందిన వారికి రూ.10 లక్షలు, ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం కేవలం మూడు నుంచి వారం రోజుల్లోనే అందించింది. అంత భారీ స్థాయిలో పరిహారం సీఎం జగన్ ప్రకటించడంతో ప్రతిపక్షాల సైతం నోరెళ్లబెట్టాయి. -
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
2023, నవంబర్ 19న ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 49 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలని ప్రయత్నించింది. మత్స్యకారులను ప్రభుత్వంపై రెచ్చగెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు, ఇతర పార్టీలకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎప్పటిలాగే ప్రమాదం జరిగిన మూడో రోజే నష్టపోయిన బోటు యజమానులకు రూ.7.11 కోట్లు అందజేసింది. అలాగే బోట్లపై ఆధారపడి జీవనోపాధి కోల్పోయిన 400 మంది కలాసీలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. -
గోదావరి వరదల సమయంలోను..
భారీ వర్షాలు కారణంగా గోదావరి పోటెత్తింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాలు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తాను పర్యటనకు వచ్చేలోగా సహాయక చర్యలతో పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని చెప్పారు. దీంతో పాక్షికంగా దెబ్బతిన్న సుమారు 20 వేల ఇళ్లకు రూ.2 వేలు చొప్పున మూడు రోజుల్లోనే పరిహారం అందించారు. నాలుగో రోజు సీఎం చింతూరులో పర్యటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ పరిహారం అందిందని జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు. -
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
విశాఖ సిటీ : చంద్రబాబుకు అరచేతిలో వైకుంఠం చూపించడంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఏ సంఘటనైనా, ప్రమాదన్నైనా తన రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాద బాధితులకు సత్వర సాయం అందించాలని పరితపించారు. టీడీపీ హయాంలో సంభవించిన విపత్కర పరిస్థితుల్లో హడావుడి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమైతే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలపై దృష్టి సారించింది. అప్పట్లో నష్టపరిహారం కోసం బాధితులు ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రాగా.. ఈ ప్రభుత్వం ప్రమాదం జరిగిన గంటల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమచేసింది. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రమాద సమయాల్లో గత, ప్రస్తుత ప్రభుత్వాలు స్పందించి సహాయం అందించిన తీరుపై ఓటర్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో హుద్హుద్ తుపాను సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ ఐదేళ్లలో ఎల్జీ పాలిమర్స్, హార్బర్ ఘటనల్లోను, అలాగే వరదలతో పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా అల్లూరి జిల్లాలో నాలుగు మండలాలు నీట మునిగిన సమయంలో ప్రభుత్వం కేవలం 72 గంటల్లోనే బాధితులకు నష్ట పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రమాద, విపత్కర పరిస్థితుల్లోను చేతికి ఎముక లేదు అన్న చందంగా సీఎం జగన్మోహన్రెడ్డి బాధితులకు సహాయం అందిస్తూ వస్తున్నారు. చంద్రబాబులా ప్రమాదాలలో రాజకీయ లబ్ధి కోసం పాకులాడకుండా.. బాధితులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయా ప్రాంతానికి వెళ్లి హడావుడి, ప్రచార ఆర్భాటాలు చేయకుండా యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తూ.. బాధితులకు పరిహారం కూడా రెండు, మూడు రోజుల్లోనే అందించారు. ఆ తరువాతే సీఎం జగన్ బాధితులను పరామర్శిస్తూ వారికి పరిహారం అందిందా? లేదా? అని మరోసారి వాకబు చేస్తూ మనసున్న ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అప్పటి టీడీపీకి.. ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మేలుపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement