-
No Headline
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ‘పార్వతీపురం మన్యం’ ప్రత్యేక జిల్లాగా అవతరించింది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. పాలన వికేంద్రీకరణ జరిగింది. జిల్లా ప్రజలకు పాలన చేరువైంది. ప్రభుత్వ పథకాలు ఠంచన్గా అందుతున్నాయి. ప్రతి ఇంటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి. మెరుగైన వైద్యసేవలు అక్కరకు వచ్చాయి. వివిధ అభివృద్ధి పనులతో పార్వతీపురం ప్రగతిపథంలో పయనిస్తూ నేడు అందరినీ ఆకర్షిస్తోంది. -
పాఠశాలల అభివృద్ధి ఇలా...
●మొత్తం పాఠశాలలు : 229 ●నాడు–నేడు కింద ఆధునీకరించినవి : 198 ●నాడు–నేడు కోసం చేపట్టిన ఖర్చు : రూ. 54.58 కోట్లు అక్కరకు వచ్చిన ఆర్బీకేలు ●మంజూరైన ఆర్బీకేలు: 37 ●అందుబాటులోకి వచ్చిన భవనాలు: 11 ●వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఆర్బీకేలు: 26 ●నిర్మాణాల కోసం వెచ్చించిన నిధులు: రూ.8.85 కోట్లు -
పార్వతీపురంలో అభివృద్ధి జోరు
●నియోజకవర్గానికి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా రూ.1540 కోట్ల లబ్ధి ●రూ.300 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు పార్వతీపురం వ్యూ పార్వతీపురం టౌన్: కొండ, మైదాన ప్రాంతాల కలబోత పార్వతీపురం నియోజకవర్గం. పార్వతీపురం మున్సిపాల్టీ, పార్వతీపురం , సీతానగరం, బలిజిపేట మండలాలతో కూడిన నియోజకవర్గం ఒడిశా రాష్ట్రం సరిహద్దుగా విస్తరించి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నియోజవకవర్గంలో అభివృద్ధి పవనాలు జోరుగా వీచాయి. మల్లీ స్పెషాల్టీ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరైంది. పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. మన్యం ప్రాంతంలో వంతెన నిర్మాణాలతో రోడ్ల కష్టాలు తీరాయి. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల కింద 1.84లక్షలమంది లబ్ధిదారులకు రూ.1540 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ప్రతి ఇంటా ఆర్థిక సంక్షేమం వెల్లివిరుస్తోంది. రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పనులు జోరుగా సాగాయి. బలిజిపేట మండలంలో 13, సీతానగరం మండలంలో 11, పార్వతీపురం మండలంలో 15 బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. పార్వతీపురం బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పార్వతీపురం–బొబ్బిలి వరకు 25 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. మేజర్ ప్రాజెక్టులు గిరిజన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాకు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణాని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూ.49.56 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కళాశాలకు రూ.600 కోట్ల నిధులు మంజూరు చేశారు. రూ.63 కోట్ల ఖర్చుతో పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపట్టారు. జల్జీవన్ మిషన్ కింద రూ.300 కోట్ల ఖర్చుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటి కుళాయిలు వేసే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. సాగునీటి సదుపాయం రైతన్నల సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. స్థానిక పాలకుల చొరవతో బలిజిపేట మండలం అంకలం నుంచి బలిజిపేట వరకూ కాలువలో సీసీ లైనింగ్ కోసం రూ.17 కోట్ల నిధులు మంజూరుచేసి పనులు పూర్తిచేయించింది. పెదపెంకి, అంపావల్లి, వంజరంపేట, బైరిపురం గ్రామాలకు కాలువ తవ్వించి సాగునీటి సదుపాయం కల్పించింది. తోటపల్లి రైట్ కెనాల్ నుంచి లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అరసాడ, పరిసర గ్రామాల రైతుల భూములకు సాగునీరు అందించే పనులు ప్రారంభించింది. నియోజకవర్గంలోని గిరిజన రైతులకు 50,000 వేల ఎకరాలకు పోడు పట్టాలు అందజేసింది. వ్యవసాయ రాయితీలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించింది. వైద్యం చేరువ గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ధనవంతులకే పరిమతమైన ఫ్యామిలీ డాక్టర్ వైద్యాన్ని పల్లె ప్రజలకు చేరువ చేసింది. ఊరూరా/వార్డువార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి సుమారు 87వేల మందికి, ఫ్యామిలీ డాక్టర్ శిబిరాల్లో 92వేల మందికి వైద్యులు వైద్యసేవలు అందించారు. అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి మూడు 108 అంబులెన్స్లు, ఒక నియోనేటల్ అంబులెన్స్లను అందుబాటులో ఉంచి సత్వర వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. వంతెనల నిర్మాణానికి అధికప్రాధాన్యం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వంతెనల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సువర్ణముఖి నదిపై గెడ్డలుప్పి–బగ్గన్నదొరవలస గ్రామాల మధ్య రూ.12కోట్ల ఖర్చు తో వంతెన నిర్మాణం పూర్తిచేసింది. సీతానగరం మండలంలోని బూర్జ– చిన అంకలం వద్ద వంతెన కోసం రూ.10కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. పార్వతీపురం మండలం తాళ్లబురిడి వద్ద సాకిగెడ్డపై వంతెన నిర్మించడంతో ప్రజల రాకపోకల కష్టాలు తొలగాయి. మెడికల్ కళాశాలకు రూ.600 కోట్ల నిధులు మంజూరు రూ.49.56 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్కిల్ హబ్లతో ఉద్యోగ విప్లవం ఇంటింటా సంక్షేమ వికాసం పార్వతీపురం పట్టణాభివృద్ధి ఇలా.. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా రూ.2కోట్లతో రెండు పార్కుల అభివృద్ధి రూ.2కోట్ల ఖర్చుతో బైపాస్ రోడ్డు నిర్మాణం వరహాల గెడ్డలో పూడికల తొలగింపు రూ.1.20 కోట్లతో చెరువుల సుందరీకరణ -
ఆ కమిటీల కథ.. గుర్తుంది కదా..!
ఆ కుట్రలు కళ్ల ముంగిటే ఉన్నాయి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశామని జన్మభూమి కమిటీలు కక్ష కట్టాయి. నాతో పాటు 83 మంది పింఛన్లు అన్యాయంగా తొలగించారు. అప్పట్లో జన్మభూ మి కమిటీలు చేసిన కుట్రలు ఇంకా కళ్ల ముంగిటే ఉన్నాయి. కొంత మంది పింఛన్దారులు జన్మభూమి కమిటీల కాళ్లపై పడినా కరుణ చూపలేదు. అలాంటి జన్మభూ మి కమిటీల పాలన కలలో కూడా ఊహించలేం. దీక్షలు చేశాం. జిల్లా అధికారులను కలిశాం. అయినా పింఛన్లు ఇవ్వలేదు. మళ్లీ వైఎ స్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ పింఛన్లు వచ్చాయి. – బెండి అప్పారావు, పింఛన్దారుడు, యలమంచిలి, కోటబొమ్మాళి మండలం● అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అండతో రెచ్చిపోయిన జన్మభూమి కమిటీలు ● కోటబొమ్మాళి మండలం యలమంచిలిలో 83 పింఛన్లను తొలగించిన జన్మభూమి కమిటీలు ● 45 రోజులు నిరశన దీక్ష చేసిన పింఛన్దారులు ● హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని జన్మభూమి కమిటీలు ● వీరి పింఛన్లు పునరుద్ధరించిన వైఎస్సార్ సీపీ ● ఇప్పుడు రూ.4వేలు పింఛన్ ఇస్తామంటూ టీడీపీ నాటకాలు టెక్కలి: కోటబొమ్మాళి మండలం యలమంచిలి పంచాయతీ ప్రజలు టీడీపీకి అనుకూలంగా లేరు. ఇదొక్కటే వారు చేసిన తప్పు. కేవలం ఇదే కారణంతో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అండతో జన్మ భూమి కమిటీలు ఆ ఊరిలో 83 మంది పింఛన్లను కక్ష కట్టి ఆపేశారు. ఎంతగా వేడుకున్నా వారు కరుణించలేదు. అధికారమంతా వారి చేతులోనే ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. పింఛన్దారుల్లో 10 మంది మానసిక క్షోభకు గురై చనిపోయారు. తమ పింఛన్లను పునరుద్ధరించాలని వీరంతా సుమారు 45 రోజుల పాటు కోటబొమ్మాళి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలతో న్యాయ పోరాటం చేశారు. జిల్లా స్థాయి అధికారులను కూడా ఆశ్రయించారు. అయినా జన్మ భూమి కమిటీల బలం ముందు ఎవరూ సరిపోలే దు. ఆఖరకు వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జన్మభూమి కమిటీలు అడ్డుపడి పింఛన్లు ఇవ్వకుండా అధికారులను బెది రించారు. మళ్లీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారి పింఛన్లను పునరుద్ధరించారు. ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన టీడీ పీ ఇప్పుడు రూ.4వేలు పింఛన్ ఇస్తామంటూ చెబుతుండడంపై పింఛన్దారులు నవ్వుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ పాలనలో యలమంచిలి పంచాయతీలో జ న్మభూమి కమిటీల కక్ష సాధింపు చర్యలకు సుమారు 10 మంది పింఛన్దారులు బలైపోయా రు. మామిడి లక్ష్మినారాయణ, వేసవి వరలక్ష్మి, కెల్లి తవుడు, కోట వెంకట్రావు, బలగ లచ్చమ్మతో పాటు మరి కొంత మంది బెంగతో మరణించారు. ఇంటిపై పచ్చ జెండా.. బండి వెనుక పార్టీ పేరు.. జన్మభూమి కమిటీలు చూసిన అర్హతలివి. కనిపిస్తే దండం పెట్టాలి.. పథకం కావాలంటే అడుక్కో వాలి.. ఆ కమిటీలు ఊరూరా పెట్టిన నిబంధనలివి. పింఛన్ ఇస్తే తీసుకోవాలి.. లేదంటే నోరు మూసుకుని ఉండాలి.. ఐదేళ్ల పాటు వారు సాగించిన దౌర్జన్య కాండ ఇది. ప్రజా స్వామ్యం సిగ్గు పడేలా, రాజ్యాంగ వ్యవస్థ తలదించుకునేలా జన్మభూమి కమిటీలతో టీడీపీ సాగించిన పాలన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈ కమిటీల అరాచకానికి కోటబొమ్మాళి ఓ ప్రత్యక్ష నిదర్శనం. ఐదేళ్ల కిందట జరిగిన ఆ కథ లోతుల్లోకి వెళితే.. కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ వారు మా పింఛన్లు తీసేశారు. కోట బొమ్మాళి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర 45 రోజులు న్యాయ పోరాటం చేశాం. కలెక్టర్ స్పందించి పింఛన్లు ఇవ్వాలని ఆదేశించినప్పటికీ జన్మభూమి కమిటీల ముందు ఆదేశాలు పనిచేయలేదు. ఐదేళ్ల నిరీక్ష తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మా అందరికీ పింఛన్లు వచ్చాయి. అయితే అప్పటికే కొంత మంది బెంగ పెట్టుకుని చనిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చంద్రబాబు చెబుతున్న మాటలకు మేము మోసపోయేది లేదు. – కవిటి మన్మధరావు, పింఛన్దారుడు, యలమంచిలి. నా కూతురిని పొట్టన పెట్టుకున్నారు... నా కూతురు వేసవి వరలక్ష్మికి వికలాంగ పింఛన్ వస్తుండేది. జన్మభూమి కమిటీలు ఆ పింఛన్ తీసేశారు. ఎన్నో సార్లు కమిటీ నాయకుల కాళ్లపై పడి మొరపెట్టుకున్నా, మా ఆవేదన ఆలకించలేదు. రోజులు గడిచిన కొద్దీ నా కూ తురు బెంగ పెట్టుకుని చనిపోయింది. అన్యాయంగా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. – వేసవి రామ్ముర్తి, జన్మభూమి కమిటీల కక్షసాధింపుతో మృతి చెందిన వరలక్ష్మి తండ్రి. -
సజావుగా పోస్టల్ బ్యాలెట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జిల్లాలో ఆదివారం సజావుగా జరిగింది. రెండో రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఓపీఓలు, సెక్టార్ అఽధి కారులు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, అకౌంట్, వీవీటీ, వీఎస్టీ, బీఎల్ఓ, ఆర్ఓ, ఏఆర్ఓ, కంట్రోల్ రూంలో పనిచేసిన వారు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఇచ్ఛాపురంలో 956, పలాసలో 934, టెక్కలిలో 1528, పాతపట్నంలో 1311, శ్రీకాకుళంలో 2059, ఆమదాలవలసలో 1397, ఎచ్చెర్లలో 851, నరసన్నపేటలో 1452 ఓట్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా రెండోరోజు 10,488 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. మొత్తం రెండు రోజులు కలిపి 17,492 ఓట్లు పడ్డాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement