ఆసీస్‌కు భారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు భారీ లక్ష్యం

Published Sun, Jun 9 2019 7:36 PM

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 353  పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.  శిఖర్‌ ధావన్‌(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్‌ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. మ్యాచ్‌ ఆరంభం మొదలుకొని చివరి వరకూ భారత్‌ బ్యాటింగ్‌లో సత్తాచాటింది.