ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Fri, Jul 26 2019 8:18 PM

తిరుమలలో ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు రద్దుతో మంచి ఫలితం వచ్చిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజూ సుమారు రెండు గంటల సమయం అదనంగా సామాన్య భక్తులకు లభిస్తుందన్నారు. ఎర్రమంజిల్ అసెంబ్లీ భవనాల కూల్చివేతపై తెలంగాణ  హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ చట్టం 2018 గురించి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సమర్పించాలని హైకోర్టు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement