ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Published Sun, Dec 2 2018 7:59 AM

రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీ కోనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. అందులో ఏడాదిన్నర చిన్నారి  కూడా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఈ ప్రమాదం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి చెన్నైకు పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ, రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తున్న కారు ఢీకోనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.