కుమార్తెను వేధించాడంటూ ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

యువతిని వేధించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని ఇద్దరు మహిళలు చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. మహేశ్వర్‌ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎస్‌ఐమోహన్‌లాల్‌ భయాల్‌ తన సిబ్బందితో కలిసి రైడ్‌ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ఇంటి వారికి, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ మోహన్‌ భయాల్‌ తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ.. అతనిపై దాడి చేసింది. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మోహన్‌ భయాల్‌ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చి మరి చితకబాదింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top