321వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

321వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Sat, Dec 15 2018 9:36 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 321వ రోజు శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్‌ జగన్‌ దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.