‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టుకా.. సిగ్గు చేటు’ | Sakshi
Sakshi News home page

‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టుకా.. సిగ్గు చేటు’

Published Fri, Jan 19 2018 4:23 PM

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నానికి చంద్రబాబు మరోసారి దిగారని అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని, అలా అనడం సిగ్గు చేటని చెప్పారు. నిజంగా న్యాయస్థానాలకు వెళ్లాలనుకుంటే ఆయన బీజేపీతో భాగస్వామ్యం వదులుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టులకు వెళ్లడం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు’ అని అంబటి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement