కృష్ణా పుష్కరాల్లో విషాదం | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాల్లో విషాదం

Published Fri, Aug 12 2016 6:39 PM

కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన ఐదేళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికని నదిలోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశామని గప్పాలు కొట్టిన ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement