డిజిటల్‌ చెల్లింపులకు బంపర్‌ డ్రా | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపులకు బంపర్‌ డ్రా

Published Fri, Dec 16 2016 7:23 AM

దేశ ప్రజల్ని డిజిటల్‌ వైపు మళ్లించేం దుకు కేంద్రం గురువారం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. డిజిటల్‌ చెల్లింపులు చేస్తే బంపర్‌ డ్రాలు, మెగా డ్రాల రూపంలో వినియోగదారులు, వ్యాపారులకు భారీ ప్రో త్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. క్రిస్మస్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కోసం రూ.340 కోట్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు పే ర్కొంది. ఈ మేరకు వినియోగదారుల కోసం ‘లక్కీ గ్రాహక్‌ యోజన’, వ్యాపారుల కోసం ‘డిజి ధన్ వ్యాపార్‌ యోజన’లను డిసెంబర్‌ 25 నుంచి ప్రారంభిస్తున్నామని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. రూ. 50 నుంచి రూ. 3వేల మధ్య డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తే లక్కీడ్రా నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement