పంద్రాగస్టు వేడుకల్లోనూ పచ్చి అబద్ధాలు | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకల్లోనూ పచ్చి అబద్ధాలు

Published Tue, Aug 15 2017 12:54 PM

పంద్రాగస్టు వేడుకల్లోనూ సీఎం చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్ల కిందట ఎన్నికల సందర్భంగా తిరుపతిలోని ఇదే వేదిక మీదగా చేసిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. మంగళవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేరుస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేకుంటే రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అబద్ధాలు చెప్పారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement