Sakshi News home page

టీడీపీ కార్యక్రమంలో జెడ్‌బీఎన్‌ఎఫ్‌ ఉద్యోగి

Published Wed, Apr 17 2024 1:55 AM

టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటయ్య (వృత్తంలో ఉన్న వ్యక్తి) 
 - Sakshi

మైదుకూరు : మైదుకూరు మండలం తువ్వపల్లె పంచాయతీలో మంగళవారం టీడీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ (జెడ్‌బీఎన్‌ఎఫ్‌) విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి పాల్గొన్నారు. తువ్వపల్లె ఎస్సీ కాలనీకి చెందిన పలు కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. ఆ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాలువపల్లె వెంకటయ్య అనే వ్యక్తి పాల్గొనడం గమనార్హం. చెన్నూరులో ప్రకృతి వ్యవసాయం విభాగంలో వెంకటయ్య ఎల్‌–2 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినా వెంకటయ్య టీడీపీ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రామకృష్ణరాజును వివరణ కోరగా, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నారు. వెంకటయ్యపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, అతనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement