ఎన్నికల వేళ ప్రలోభాలను అడ్డుకోవడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు
తలెత్తకుండా పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని
ఏడు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
● సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ● ఏడు గ్రామాల్లో 33 సీసీ కెమెరాల ఏర్పాటు
అంతా ప్రశాంతం
పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు మండల కేంద్రాల్లో జాతీయ రహదారిపై ఉన్న గ్రామాలు, సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు నమోదు కాలేదు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి సైతం ఎలాంటి రిమార్కులు రాలేదు.
–శంకర్, ఎస్ఐ, బొంరాస్పేట
బొంరాస్పేట: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి–163 వెంటనున్న గ్రామాలైన తుంకిమెట్ల, రేగడిమైలారం గ్రామాలతో పాటుగా ఎన్నికల సంఘం సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన వడిచర్ల, ఎన్కేపల్లి, మహంతీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసి నిరంతం టీవీలో పర్యవేక్షిస్తున్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటం, మద్యం మత్తులో అల్లర్లు జరగకుండా, డబ్బులు, మద్యం రవాణా అరికట్టడం, గ్రామాల్లో పోలీసు బందోబస్తును తగ్గించడం, నిశ్పక్షపాతంగా నిఘా ఉంచడం వంటి మేలు చేకూరుతోంది.
గ్రామం సీసీ కెమెరాల సంఖ్య