రూఫ్‌ ఇండియా– 2024 ఎక్స్‌పోకు తరలిరండి | Sakshi
Sakshi News home page

రూఫ్‌ ఇండియా– 2024 ఎక్స్‌పోకు తరలిరండి

Published Tue, Apr 23 2024 8:30 AM

-

సాక్షి, చైన్నె: భారతీయ రూఫింగ్‌ విభాగంలో మెటీరియల్స్‌, సాంకేతిక అంశాలను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా 21 ఎడిషన్‌గా రూఫ్‌ ఇండియా–2024 ఎక్స్‌ పో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నట్టు ట్రేడ్‌ ఫెయిర్‌ నిర్వాహకుడు గగన్‌ సాహ్ని తెలిపారు. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ వేదికగా జరిగే ఈ ఎక్స్‌పోకు తరలిరావాలని ఇక్కడి సంస్థలకు పి లుపునిస్తూ సోమవారం స్థానికం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విభాగంలో గ్లోబల్‌ మార్కెట్‌ లీడర్‌లను కలిగిన 6 దేశాల నుంచి 200లకు పైగా ఎగ్జిబిటర్లు , సరికొత్త సాంకేతికతలు, రూఫింగ్‌, క్లాడింగ్‌, ప్రీ– ఇంజినీరింగ్‌ , మెటల్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌, టెన్సిల్‌ ఆర్కిటెక్చర్‌ తదితర వాటిని ప్రదర్శించబోతు న్నారని వివరించారు. కొత్త భవనాలు, పరిశ్రమలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు ప్రాజెక్టులు, మాల్స్‌, టౌన్‌ షిప్‌, మల్టీ ఫ్లెక్స్‌ల నిర్మాణాలు, ఆధునీకరణ తదితర అంశాల గురించి కొత్త ఆవిష్కరణలు ఈ ఎక్స్‌పోలో ఉంటాయని తెలిపారు.

Advertisement
Advertisement