యువకుడిని బెదిరించి రూ.30 లక్షల దోపిడీ | Sakshi
Sakshi News home page

యువకుడిని బెదిరించి రూ.30 లక్షల దోపిడీ

Published Fri, Apr 19 2024 1:55 AM

-

అన్నానగర్‌: ఓ యువకుడిని బెదిరించి, రూ.30లక్షలు దోచుకున్న ఘటన కలకలం రేపింది. నైల్లె జిల్లా నాంగునేరి సమీపంలోని మరుకల్‌ కురిచ్చికి చెందిన వానుమామలై (35) కూలీ. ఇతను బుధవారం సాయంత్రం బైకులో నంగునేరి ఇండస్ట్రియల్‌ పార్కు సమీపంలోని పట్టార్‌ కులం మండలానికి బయలుదేరాడు. ఆ సమయంలో బైకుల్లో వచ్చిన 8 మంది వ్యక్తులు వానుమామలైని కొడవలితో బెదిరించి రూ.30 లక్షలు లాక్కొని పరారయ్యారు. ఈ విషయమై వానుమామలై నంగు నేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా వా నుమామలైకి రూ.30 లక్షలు ఎలా వచ్చాయంటూ ఆ రా తీశారు. తనకు అప్పు ఉందని, దాన్ని తీర్చేందుకు తనకు తెలిసిన వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లు చెప్పాడు. ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచేందు కు డబ్బును తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానించి, ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement