సాక్షి, చైన్నె: హామీలు.. ఆరోపణలు, విమర్శలు.. వాగ్వాదాలతో సాగిన ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. దీంతో సుమారు నెల పాటు సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. చివరిరోజైన బుధవారం అన్నిపార్టీల నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు సాగించాయి. నేతల ఉపన్యాసలతో హోరెత్తిన మైకులు, లౌడ్స్పీకర్లు సాయంత్రం 6 గంటల తరువాత ఒక్కసారిగా మూగబోయాయి. వివరాలు.. తమిళనాడు లోక్ సభ ఎన్నికల సంగ్రామంలో డీఎంకే ఇండియా కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలో మినీ కూటమి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి, ఒంటరిగా నామ్ తమిళర్ కట్చి సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం సాగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అగ్రనేతలు తమిళనాడుపై ఈ సారి ప్రత్యేక దృష్టి పెట్టి తరలివచ్చారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిది సార్లు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు పలుమార్లు తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమిని బలపరుస్తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రెండు సార్లు పర్యటించారు. ఈ కూటమిలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్, యువజన విభాగం నేత, మంత్రి ఉదయ నిధి స్టాలిన్, డీఎంకే డీప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పర్యటించి ఓటర్లను ఆకర్షించారు. ఈ కూటమిలోని వివిధ పార్టీల నేతలు, వామపక్షాల జాతీయ నేతలు తమకుబలం ఉన్న చోట్ల ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే కూటమి తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేశారు. ఇతర పా ర్టీల నేతలు తమ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచార పర్వం ముగియడంతో ఎన్నికల అధికారులు పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. నగదు బట్వాడా కాకుండా తనిఖీలను ముమ్మరం చేశారు.
No Headline
Published Thu, Apr 18 2024 10:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement