విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి యువకుడి మృతి

Published Fri, Nov 10 2023 4:54 AM

ఎర్రిస్వామి (ఫైల్‌) 
 - Sakshi

బొమ్మనహాళ్‌: విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లుకు చెందిన కె.ఎర్రిస్వామి(30)కి భార్య గంగమ్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఖాళీ సమయంలో గ్రామంలోని విద్యుత్‌ సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతు పనుల్లో పాలుపంచుకునేవాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం హనుమంతరాయ ఇంటికి సర్వీసు వైర్‌ మార్చేందుకు ఎల్‌సీ తీసుకోకుండానే విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎర్రిస్వామి... షాక్‌కు గురై కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తీసుకెళ్లగా... చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement