Sakshi News home page

గేదెలను తప్పించే క్రమంలో..

Published Sun, Nov 19 2023 12:10 AM

- - Sakshi

మర్రిపాడు: రోడ్డుపైకి వచ్చిన గేదెలను తప్పించే క్రమంలో లారీ బోల్తాపడిన ఘటన పొంగూరుకండ్రిక సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. బద్వేల్‌ నుంచి కృష్ణపట్నం పోర్టుకు లిక్విడ్‌ యాసిడ్‌ లోడుతో లారీ బయల్దేరింది. ఈ క్రమంలో పొంగూరు కండ్రిక సమీపంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో రోడ్డుపైకి గేదెలు వచ్చాయి. వీటిని తప్పించే క్రమంలో లారీ బోల్తాపడింది. సమాచారం అందుకున్న మర్రిపాడు ఎస్సై విశ్వనాథరెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డుగా ఉన్న లారీని క్రేన్‌ సాయంతో తొలగించారు. క్యాన్ల నుంచి లిక్విడ్‌ యాసిడ్‌ లీకవడంతో రెండు గంటల పాటు శ్రమించి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement