Sakshi News home page

IPL 2024: ఐపీఎల్‌ ఫీవర్‌ షురూ

Published Sun, Mar 17 2024 6:57 PM

IPL 2024: Players From All The Franchises Reaching The Practice Camps - Sakshi

క్రికెట్‌ అభిమానుల్లో ఐపీఎల్‌ ఫీవర్‌ మొదలైంది. లీగ్‌ ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా తమతమ జట్లతో జత కడుతున్నారు. దేశీయ ఆటగాళ్లంతా ఇదివరకే ప్రాక్టీస్‌ క్యాంప్‌ల్లో చేరిపోగా.. విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ట్రైనింగ్‌ క్యాంప్‌లకు చేరుకుంటున్నారు. 

గత కొంతకాలంగా లండన్‌లోని ఉండిన విరాట్‌ కోహ్లి సహా చాలామంది విదేశీ ఆటగాళ్లు ఇవాళ భారత్‌లో ల్యాండ్‌ అయ్యారు. కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ యశస్వి జైస్వాల్‌ ఇవాళ తమతమ జట్లతో చేరారు. ఆర్సీబీ ఆటగాళ్లు కెమారూన్‌ గ్రీన్‌, లోకీ ఫెర్గూసన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ ట్రవిస్‌ హెడ్‌, సీఎస్‌కే ప్లేయర్స్‌ మిచెల్‌ సాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌ తాజాగా ట్రైనింగ్‌ క్యాంప్‌ల్లో చేరిన వారిలో ఉన్నారు.

సీఎస్‌కే కెప్టెన్‌ ధోని, ఆర్సీబీ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ముంబై ఇండియన్స్‌ ఇషాన్‌ కిషన్‌ ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే.. ఆర్సీబీతో తలపడనుంది.

అతి త్వరలో ప్రారంభం కాబోయే ఎడిషన్‌కు సంబంధించి కేవలం కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించలేదు. నిన్ననే ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు కాబట్టి.. త్వరలోనే మిగతా షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement