Sakshi News home page

బూస్టర్‌ మోటార్‌ ఏర్పాటు

Published Tue, Apr 16 2024 6:45 AM

గండిపల్లిలో ఏర్పాటు చేసిన బూస్టర్‌ మోటార్‌   - Sakshi

● తండాలకు నీటి సరఫరా ● భగీరథ డీఈ బాలరాజ్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని గండిపల్లి గ్రామంలో మిషన్‌ భగీరథ అధికారులు బూస్టర్‌ మోటార్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రామపరిధిలో ఐదారు గిరిజన తండాలు ఉన్నాయి. దీంతో మిషన్‌ భగీరథ నీళ్లు బోరింగ్‌తండా, సరిరాంతండాలకు సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ తండాలకు భగీరథ నీళ్లు ట్యాంకులకు ఎక్కేలా బూస్టర్‌ మోటర్‌ను ఏర్పాటు చేసినట్లు భగీరథ డీఈ బాలరాజ్‌ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి తండాతండాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. నీళ్లను ఎవరూ వృథా చేయొద్దని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement