కల్యాణం..కడు రమణీయం | Sakshi
Sakshi News home page

కల్యాణం..కడు రమణీయం

Published Thu, Apr 18 2024 2:30 PM

- - Sakshi

బాలినేని నివాసం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణోత్సవంలో ప్రత్యేకంగా అలంకరించిన సీతారాముల ఉత్సవ మూర్తులు

జగదానంద కారకుడైన జగదభిరాముడు, భూజాత సీతాదేవిల కల్యాణ మహోత్సవాలు వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ చలువపందిళ్లలో సర్వాలంకరణ భూషితుడైన శ్రీరాముడు, జానకీ మాతల ఉత్సవ విగ్రహాలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణక్రతువు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు తమ నివాసం వద్ద, జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌లు సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement