పేదలకు విద్య, వైద్యం అందించటమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించటమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్టమీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీలలో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్ధిక స్థోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీలో అవకాశం కల్పించటంతో పాటు ఆరోగ్య శ్రీ ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మ ఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సాయం చేయటం కూడా మరెక్కడా లేదన్నారు. చిన్నారులకు బూట్ల నుంచి దుస్తులు, సాక్సులు, టై అందజేసి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను గడప ముంగిటకే తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణారెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్, కుమార్, ఇసాకు, ఏసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాల గురవయ్య, పురిణి ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో ‘మన ఒంగోలు–మన వాసన్న’