![ఘనంగా](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/24/23ors61a-280071_mr.jpg.webp?itok=Xjmznnss)
రాయగడ: స్థానిక కస్తూరీనగర్లోని సత్యనారాయణ ఆలయ 13వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి కుంకుమ అర్చనలు, అభిషేకాలు, సహస్రనామ పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మావుడూరు కిశోర్శర్మ ఆధ్వర్యంలో వ్రత పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి తిరువీధి కార్యక్రమం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం సుమారు రెండు వేల మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
![ఘనంగా ఆలయ వార్షికోత్సవం](/sites/default/files/gallery_images/2024/05/24/23ors61-280071_mr.jpg)
ఘనంగా ఆలయ వార్షికోత్సవం