![ఆదర్శం భీంపూర్ ఎంపీపీ](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/22/21bod204-340126_mr.jpg.webp?itok=Lj6aKfV7)
తాంసి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతుండటంతో ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఎంపీపీ కుడ్మెత రత్నప్రభ సైతం తోటి మహిళలతో కలిసి వచ్చి ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఆటో చోరీ
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన రౌతు విక్కి ఈ నెల 19న రాత్రి తన ఇంటి ముందు ఆటోను పార్కింగ్ చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఆటో కనిపించకుండా పోయింది. దీంతో ఆయన చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై లాల్సింగ్ నాయక్ తెలిపారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
ఖానాపూర్: మండలంలోని దిలావర్పూర్ గ్రామం మీదుగా టాటా సుప్రో వాహనంలో ఖానాపూర్కు తరలిస్తున్న పీడీఎస్ బియ్యన్ని పట్టుకున్నామని ఎస్సై లింబాద్రి తెలిపారు. గోసంపల్లి గ్రామానికి చెందిన కడమంచి లక్ష్మణ్ నాలుగు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వాహనాలు తనిఖీ చేసి పట్టకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.