Sakshi News home page

‘ఆరోగ్య మహిళ’ను సద్వినియోగం చేసుకోవాలి

Published Wed, Apr 17 2024 1:40 AM

వివరాలు తెలుసుకుంటున్న రాజేందర్‌
 - Sakshi

లక్ష్మణచాంద: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ప్రతీ మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు వచ్చే క్యాన్సర్‌, రక్తహీనత వంటి వ్యాధులతోపాటు గర్భిణులకు వచ్చే అన్ని రకాల సమస్యలకు చికిత్స చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 50 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో 11 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరిని జిల్లా కేంద్రంలోని మెటర్నిటీ ఆసుపత్రికి సిఫారసు చేశామని డాక్టర్‌ ప్రత్యూష తెలిపారు.

Advertisement
Advertisement