పరిశోధనలు పొలాల్లోకి చేరాలి

జగిత్యాలఅగ్రికల్చర్‌: వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు పొలాల్లోకి చేరాలని, అప్పుడే రైతులకు మేలు జరుగుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ డైరెక్టర్‌ రఘురామిరెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వరి విస్తీర్ణం 21శాతానికి పెరిగిందని, సో యాచిక్కుడు విస్తీర్ణం 10 శాతం పెరిగిందని, చెరు కు విస్తీర్ణం మాత్రం 73 శాతం, పెసర 61 శాతం, మొక్కజొన్న 12 శాతం, కందుల విస్తీర్ణం 8శాతం, పత్తి విస్తీర్ణం నాలుగు శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్తర తెలంగాణ జోనల్‌ స్థాయి శాస్త్రవేత్తల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆయా జిల్లాల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ సుధారాణి, పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ శ్రీనివాస్‌, అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ బాలు మాట్లాడారు.

Election 2024

Read latest Nirmal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top