![లారీ–](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24ptd82a-200076_mr.jpg.webp?itok=d08eOgYn)
● ముగ్గురు విద్యార్థులకు గాయాలు
తుగ్గలి: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం జొన్నగిరి–గిరిగెట్ల మధ్య చోటు చేసుకుంది. సూర్యతండాకు గణేష్నాయక్, బాటతండాకు చెందిన రమావత్ చరణ్ నాయక్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు సూర్యతండాకు చెందిన 9వ తరగతి విద్యార్థి ముడావత్ చరణ్తో కలిసి బైక్పై తుగ్గలి పరీక్షా కేంద్రానికి బయలు దేరారు. మార్గమధ్యలో గిరిగెట్ల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ – బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో విద్యార్థులు తీ వ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు బాధిత విద్యార్థులను గుత్తి ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సూర్యతండాకు చెందిన గణేష్నాయక్, ముడావత్ చరణ్నాయక్లను కర్నూలుకు తరలించారు. తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
![లారీ– బైక్ ఢీ](/sites/default/files/gallery_images/2024/05/25/24ptd82-200076_mr.jpg)
లారీ– బైక్ ఢీ