Sakshi News home page

అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

Published Sun, Apr 14 2024 8:00 AM

రైస్‌మిల్లును పరిశీలిస్తున్న
అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు - Sakshi

రామాయంపేట(మెదక్‌): సీఎంఆర్‌ను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని కోనాపూర్‌లో సాయిగీత, నాగేంద్ర రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైస్‌ మిల్లర్లు తమకు ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా బియ్యాన్ని వెంట వెంటనే రవాణా చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల అధి కారి బ్రహ్మారావు, మిల్లర్ల యజమానులు ఉన్నారు

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

చిన్నశంకరంపేట(మెదక్‌): ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలో వసతులు, ఇబ్బందులపై ఆరా తీశారు.

Advertisement
Advertisement