Sakshi News home page

జ్వరంతో పోస్టల్‌ జీడీఎస్‌ మృతి

Published Sun, Nov 12 2023 12:00 AM

-

జైపూర్‌: జ్వరంతో పోస్టల్‌ జీడీఎస్‌ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మేకల శేఖర్‌ (42) స్థానిక పోస్టాఫీసులో జీడీఎస్‌ ప్యాకర్‌గా పనిచేస్తున్నాడు. పదిరోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రక్తకణాలు తగ్గినట్లు చెప్పడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి తీసుకురాగా శనివారం ఉదయం ఇంట్లోనే మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

శేఖర్‌ (ఫైల్‌)

Advertisement

What’s your opinion

Advertisement