● ఎండలు పెరగడంతో ఎండుతున్న వాగులు, కుంటలు ● అడవిలో దాహార్తి తీర్చేందుకు నీటి వనరులు ఏర్పాటు ● జన్నారం డివిజన్లో 42చోట్ల సాసర్వెల్లు
మరో రెండు నెలలుఏప్రిల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనున్నందున నీటి సమస్య రాకుండా అధికారులు దృష్టి సారిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తడంతో సీసీ సాసర్వెల్లు ఏర్పాటు చేసి నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరో రెండు నెలల వరకు ఇదే సమస్య ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్లకుండా కట్టడి చేయడం వల్ల సాసర్వెల్లో నీరు వన్యప్రాణులు స్వేచ్ఛగా తాగుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పర్యవేక్షణ చేస్తాంఏప్రిల్, మే రెండు మాసాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాసర్వెల్ ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని పోయిస్తున్నాం. శబ్దానికి వన్యప్రాణులు బెదిరిపోయే అవకాశం ఉన్నందున ఎక్కువగా సాసర్వెల్ లేకుండా చూస్తున్నాం. అవసరమైతేనే ఏర్పాటు చేస్తున్నాం. నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– హఫీజొద్దీన్, రేంజ్ అధికారిజన్నారం: ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతుండడంతో మనుషులతోపాటు పశుపక్ష్యాదులు అల్లాడిపోతున్నాయి. వాగులు, వంకలు, ఊట కుంట లు, చెలిమెలు, చెక్డ్యాంలు ఎండిపోతున్నాయి. దీంతో కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణులకు తాగునీటి ఏర్పడకుండా అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. అడవిలో నీరు లభించకపోతే జంతువులు దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, జనా వాసాల వైపు పరుగులు తీస్తూ ప్రాణాల మీదకు తె చ్చుకునే ప్రమాదం ఉంది. దీంతో అటవీ శాఖ అ ధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర తీ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి నుంచే ఎండల తీవ్రత పెరిగినందున అడవిలోని నీటికుంటలు, చెలిమెలు, కుంటలు ఎండుతున్నాయి. దీనికి తోడు కడెం ప్రధాన కాలువ నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల ఊటలు లేక ఇబ్బంది ఏర్పడుతోంది.
జంతువుల ఆవాసాల్లోనే..
కవ్వాల్ టైగర్జోన్లో 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏ రియా ఉంది. కోర్ ఏరియాలో వన్యప్రాణులు ఆవా సాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు, చు క్కల దుప్పులు, సాంబార్లు, నీలుగాయిలు, అడవి పందులు, కొండగొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు ఉ న్నాయి. అత్యధికంగా చుక్కల దుప్పులు, అడవి పందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య రెట్టింపు అయిన ట్లు అధికారులు చెబుతున్నారు. జంతువులు సాధారణంగా ఆ హార అన్వేషణ కోసం నాలుగు కిలోమీటర్ల పరిధిలో తిరుగుతాయి. వీటికి సరిపడా నీటి వనరులున్నా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం నీటికుంటలు, చెలిమెలు, వాగులు ఎండిపోతున్నాయి. జంతువుల ఆవాసాల్లోనే నీటి ఎద్దడి రాకుండా అధి కారులు చొరవ తీసుకుంటున్నారు.
రెండు కిలోమీటర్ల దూరంలో నీటి వనరు
జన్నారం డివిజన్లో ప్రతీ రెండు కిలోమీటర్ల దూ రంలో ఒక నీటి వనరు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు కిలోమీటర్ల దూరంలో సో లార్పంపు లేదా ర్యాంపు వెల్ లేదా నీటికుంట ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు కిలోమీటర్ల దూ రంలో నీటివనరు లేని ప్రాంతంలో సాసర్వెల్లు ఏర్పాటు చేశారు. జన్నారం అటవీ డివిజన్లో 40 బీట్లలో 42 చోట్ల సాసర్వెల్లు ఏర్పాటు చేసి గ్రా మ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు పోయిస్తున్నారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్గార్డులు పర్యవేక్షిస్తూ నీరు అయిపోగానే నింపుతున్నారు.సాసర్వెల్లో నీరుజన్నారం అటవీ డివిజన్లో 40 అటవీ బీట్లు ఉన్నాయి. వీటి పరిధిలో నీటికుంటలు సోలార్పంపులతో నింపుతున్నారు. ఎండల తీవ్రతకు కుంటల్లో నీరు ఇంకిపోతుండడం, సోలార్ పంపుల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండడం వల్ల అధికారులు సాసర్వెల్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తున్నారు. సహజసిద్ధంగా సోలార్పంపులు, ర్యాంపువెల్లు, చెలిమెలు, వాగుల ద్వారా నీరందించాలని అటవీ అధికారులు ప్రయత్నించినా ఎండల తీవ్రతతో సఫలం కాలేకపోతున్నారు.