రెండు ఇళ్లలో చోరీ | Sakshi
Sakshi News home page

రెండు ఇళ్లలో చోరీ

Published Sat, May 25 2024 12:30 PM

-

పెబ్బేరు రూరల్‌: వనపర్తి మండలం అప్పాయిపల్లిలో గురువారం గుర్తుతెలియని దుండగులు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. రూరల్‌ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి వివరాల మేరకు.. అప్పాయిపల్లికి చెందిన దామరగిద్ద శంకర్‌రావు, అతడి తమ్ముడు ఆనంద్‌రావు ఇళ్లలోకి దొంగలు చొరబడి వెండి వస్తువులతో పాటు కొంత నగదును చోరీ చేశారు. ఆనంద్‌రావు ఇంట్లో 10 తులాల వెండి విగ్రహం, రూ.5వేలు, శంకర్‌రావు ఇంట్లో 20 తులాల వెండి వస్తువులు, రూ 10వేల నగదు చోరీ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అదేవిధంగా బాండుపేపర్లు, ప్రాంసరీ నోట్లను కాల్చి బూడిద చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement