మధ్యాహ్నం వరకు ఎండ.. సాయంత్రానికి వాన | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం వరకు ఎండ.. సాయంత్రానికి వాన

Published Sat, May 25 2024 2:30 PM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 10 రోజుల తర్వాత శుక్రవారం ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. వడగాలుల తీవ్రత అధికమైంది. ఎండల వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రానికి ఉపశమనం దక్కింది. 6 గంటల ప్రాంతం నుంచి కర్నూలు సహా వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.6 డిగ్రీలు, కర్నూలులో 41.4, కౌతాళంలో 41.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 42.2, మిడుతూరులో 41.7, పాణ్యంలో 41.4, డోన్‌లో 41.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా.. 83 మి.మీ వర్షం కురిసింది. 107 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కర్నూలు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement