Sakshi News home page

గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోండి

Published Thu, Apr 18 2024 9:55 AM

శిక్షణ శిబిరాన్ని పరిశీలిస్తున్న తుషార్‌గిరినాథ్‌, సెల్వమణి తదితరులు  
 - Sakshi

బనశంకరి: శిక్షణ శిబిరానికి గైర్హాజరయ్యే పోలింగ్‌ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌గిరినాథ్‌ ఆదేశించారు. శేషాద్రిపురంలోని హోం సైన్స్‌కాలేజీ, శివాజీనగర్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్‌కాలేజీ, విఠల్‌ మాల్య రోడ్డులోని సెయింట్‌జోసెప్‌ ఇండియన్‌ హైస్కూల్‌లో పోలింగ్‌ ఆపీసర్లు, ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలను బుధవారం ఆయన సందర్శించారు.పోలింగ్‌రోజు నిర్వహించే కార్యకలాపాలపై మాస్టర్‌ ట్రైనర్లు ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్నారు. వీవీప్యాట్‌ కంట్రోల్‌యూనిట్‌, బ్యాలెట్‌యూనిట్‌ పనితీరుపై బుక్‌లెట్‌ అందించామన్నారు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. శిబిరాల్లో తాగునీరు, భోజన సదుపాయాలపై ఆరా తీశారు. ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్‌ సెల్వమణి, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారులు చిదానంద ఎస్‌.వఠారె, కమలాబాయి, మమతాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement