సిరిసిల్ల క్రైం: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో స్వర్ణకార కుటుంబానికి చెందిన చింతోజు రమేశ్(46) స్థానిక కోర్టు ఎదురుగా హార్డ్వేర్ షాపు నిర్వహిస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా సమయంలో వ్యాపారం దెబ్బతినగా ఇప్పటికీ కోలుకోలేదు. వ్యాపారం, కుటుంబం కోసం దాదాపు రూ.20 లక్షల అప్పులు చేశాడు. తాను ఇబ్బందులు పడుతున్నానని.. ఎప్పటికై నా అప్పులు తీర్చాల్సిందేనని.. కానీ, ఎలా తీర్చాలంటూ భార్యకు చెబుతూ బాధ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం అద్దె ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కాసేపటికి గమనించిన భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పట్టణ స్వర్ణకారులు, ఇతర వ్యాపారులు అక్కడికి తరలివచ్చారు. రమేశ్ అందరితో కలివిడిగా ఉండేవాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య ఉమ, పదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మృతదేహం వద్ద చిన్నారుల రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. రమేశ్కు కుటుంబసభ్యులతో ఆస్తి విషయంలో తగాదాలు న్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
Published Thu, May 23 2024 12:30 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
‘సెర్చ్’ ఏదీ ?
థాయిలాండ్లో అద్భుతం
‘బంధం’ తెగిపోతోంది!
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం
సంబంధానికి అడ్డొస్తున్నాడని..
నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
తప్పక చదవండి
- బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
- సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
- దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
- ‘సెర్చ్’ ఏదీ ?
- నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
- పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వండి
- మస్కా మజాకా!
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- పోరాటం.. ఆరాటమే!
- విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
Advertisement