కౌలు రైతులకు రూ.12 వేలు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు రూ.12 వేలు ఇవ్వాలి

Published Sat, May 25 2024 3:55 PM

కౌలు రైతులకు  రూ.12 వేలు ఇవ్వాలి

జనగామ రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూమి లేని వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు రూ.12 వేలు చెల్లింపు తక్షణం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లా ప్లీనంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు రూ.12 వేలు, మహిళలకు రూ.2,500, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ నేడు ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. అర్హులందరికీ తెల్ల రేషన్‌కార్డులు, ఉపాధి డబ్బులు పెండింగ్‌లో పెట్టి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement