గ్రామపంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి | Sakshi
Sakshi News home page

గ్రామపంచాయతీ వ్యవస్థ బలోపేతానికి కృషి

Published Wed, Jan 17 2024 11:56 PM

జీవన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న కారోబార్లు
 - Sakshi

జగిత్యాలటౌన్‌: గ్రామ పంచాయతీల్లో కారోబార్ల సేవలు, సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక గుర్తింపు, హోదా కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలోని కారోబార్లు ఎమ్మెల్సీని బుధవారం ఆయన నివాసంలో కలిశారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నివర్గాలకూ న్యాయం జరుగుతుందన్నారు. నాయకులు, కారోబార్లు, మల్టీపర్పస్‌ వర్కర్స్‌ పాల్గొన్నారు.

మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

వచ్చేనెల 11, 12తేదీల్లో ఖమ్మంలో నిర్వహించే టీపీటీఎఫ్‌ రాష్ట్ర రెండో విద్యా, వైజ్ఞానికి మహాసభల వా ల్‌పోస్టర్‌ను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భోగ రమేశ్‌, ప్రధాన కార్యదర్శి కొక్కుల రాంచంద్రం, సూద రాజేందర్‌, సంగనభట్ల రవీందర్‌, సీహెచ్‌వీ.సత్యప్రకాష్‌, ఎడ్ల గోవర్దన్‌, నాగభూషణం, సంజీవరాణి, రాచమల్ల మహేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement