చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

Published Wed, May 22 2024 9:55 AM

-

పాల్వంచ: అనారోగ్య సమస్యల కారణంగా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని గట్టాయిగూడెంనకు చెందిన మాలోతు శ్రీను (38) ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి సక్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ బి.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement